KCR: ఆర్టీసీ వ్యవహారంలో సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు!

  • తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
  • కేసీఆర్ సమీక్ష సమావేశం
  • ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీ అద్దె బస్సులు పెంపు కోసం మరిన్ని నోటిఫికేషన్లు జారీచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు మరింత వేగవంతం చేస్తూనే, ప్రైవేట్ రూట్లపై సర్వే నిర్వహించాలని తెలిపారు. ప్రైవేటు రూట్లు, బస్సుల విధి విధానాలపై కసరత్తు చేయాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు చూస్తుంటే ఆర్టీసీ కార్మిక సంఘాలతో రాజీ పడేది లేదని అర్థమవుతోంది. జేఏసీ నేతలు చర్చల మధ్యలోనే వెళ్లిపోయారని అధికారులు ఇచ్చిన నివేదికతో కేసీఆర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News