Diwali: ముగిసిన దీపావళి మూరత్ ట్రేడింగ్

  • లాభాల్లో సెన్సెక్స్
  • ఆరంభంలో 300 పాయింట్ల వృద్ధి
  • ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాల జోరు

ప్రతి సంవత్సరం స్టాక్ మార్కెట్లలో దీపావళి సందర్భంగా మూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీ. దీపావళి నాడు సెంటిమెంట్ పరంగా గంటపాటు ట్రేడింగ్ చేపడతారు. మూరత్ ట్రేడింగ్ ప్రారంభం కాగానే 300 పాయింట్ల వరకు ఎగబాకిన సెన్సెక్స్ ముగింపు సమయానికి 194 పాయింట్ల పెంపుతో 39,250 వద్ద ముగిసింది. అదే సమంలో నిఫ్టీ కూడా 88 పాయింట్ల వృద్ధితో 11,672 వద్ద స్థిరపడింది. మూరత్ ట్రేడింగ్ లో ఈసారి ఆటోమొబైల్, బ్యాంకింగ్ షేర్ల లావాదేవీలు ఎక్కువగా జరిగాయి.

More Telugu News