Andhra Pradesh: ఏపీ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య సిబ్బందికి దీపావళి కానుక

  • నెలకు రూ.16 వేల వేతనం
  • జీవో విడుదల
  • 2020 జనవరి నుంచి అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు పెంచింది. ఈ పెంచిన వేతనాలను వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News