హిందీ సినీరంగం మాత్రమే కాదు, మేమూ ఉన్నాం: మోదీపై ఖుష్బూ వ్యాఖ్యలు
- తన నివాసంలో బాలీవుడ్ తారలకు ప్రధాని ఆతిథ్యం
- 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమంలో కనిపించిన దక్షిణాది తారలు
- మోదీ వైఖరిపై విమర్శలు
భారత చలనచిత్ర రంగం అంటే హిందీ సినిమా రంగం ఒక్కటే కాదన్న విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం గుర్తించాలని హితవు పలికారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం అందిస్తోంది హిందీ చిత్రపరిశ్రమ ఒక్కటే కాదని, దక్షిణాది చిత్రపరిశ్రమల నుంచి కూడా భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా తోడ్పాటు అందుతోందని ఖుష్బూ తెలిపారు.
ఎంతోమంది సూపర్ స్టార్లు, టెక్నీషియన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి వచ్చారని, ఎందుకు 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమానికి దక్షిణాది ప్రముఖులను పిలవలేదని ప్రశ్నించారు. ఇది దక్షిణాదిపై వివక్ష చూపించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ప్రధాని నిర్వహించిన 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమంలో టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.