రేపు తెలంగాణ బంద్... కోర్టు తీర్పుపై ఉత్కంఠ!
- 14వ రోజుకు చేరిన బంద్
- రేపు సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ సంఘాలు
- సమ్మెకు సహకరించాలని ప్రజలను కోరిన విపక్షాలు
కాగా, ఈ బంద్ కు రాష్ట్ర ప్రజలు, ఇతర ఉద్యోగ సంఘాలు సహకరించాలని విపక్ష పార్టీల నేతలు కోరారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునేందుకు చేస్తున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు పలకాలని కోరారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు సామాన్య ప్రజలు కూడా కలిసి రావాలన్నారు. మరోవైపు రేపటి బంద్ కు సంఘీభావంగా బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరుగగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.