KCR: కేసీఆర్ కార్యాలయానికి సామాన్యుడు ఫోన్ చేయడం 'ఫేక్' అంటున్న తెలంగాణ సీఎంవో

  • కేసీఆర్ ఆఫీసుకు సామాన్యుడు ఫోన్ చేశాడంటూ మీడియా కథనాలు
  • ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారని సీఎంవో వెల్లడి
  • పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయానికి ఓ సామాన్యుడు ఫోన్ చేయగా, కార్యాలయ సిబ్బంది బదులిచ్చినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలంగాణ సీఎంవో స్పష్టం చేసింది. సీఎం కార్యాలయానికి ఫోన్ చేసిన సామాన్యుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తన గోడు వెళ్లబోసుకున్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ సీఎంవో స్పష్టతనిచ్చింది. ఆ వ్యక్తితో  సీఎం కార్యాలయ సిబ్బంది ఫోన్ లో మాట్లాడినట్టు ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారని తెలిపింది. దీనిపై నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలని కోరామని తెలంగాణ సీఎంవో అధికారులు వెల్లడించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News