లలితా జ్యుయెలరీ చోరీ కేసు... కేటుగాడు మురుగన్ లొంగుబాటు!
- సంచలనం సృష్టించిన లలితా జ్యుయెలరీ కేసు
- బెంగళూరు పోలీసులకు లొంగిపోయిన ప్రధాన నిందితుడు మురుగన్
- మురుగన్ పై 100కి పైగా కేసులు
ఆరోగ్యం బాగాలేని స్థితిలో సరిగా నడవలేకపోతున్న మురుగన్ పక్కాగా చోరీ స్కెచ్ వేయగా, అతని మేనల్లుడు సురేశ్ పకడ్బందీగా అమలు చేశాడు. అయితే సురేశ్ కోర్టులో లొంగిపోవడంతో చేసేదిలేక ప్రధాన నిందితుడు మురుగన్ కూడా లొంగుబాట పట్టాడు. మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగిపోయాడు. మురుగన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.