Vizag: అరుదైన లెటర్... అత్యంత ఎత్తయిన పోస్టాఫీస్ నుంచి ఉత్తరం పంపిన విశాఖ అమ్మాయి అనూష!

- జూలైలో ట్రెక్కింగ్ కు వెళ్లిన అనూష
- అక్కడ అమ్మకు లేఖ రాసిన విశాఖ యువతి
- నెల రోజుల తరువాత చేరిన వైనం
హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న విశాఖపట్నానికి చెందిన యువతి పుప్పాల అనూష, ట్రెక్కింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి, అక్కడి ఓ పోస్టాఫీసు బాక్స్ లో వేసిన ఉత్తరం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ రాష్ట్రంలోని హిక్కిం అనే కుగ్రామంలోని పోస్టాఫీస్ లో ఆమె ఉత్తరాన్ని పోస్ట్ చేసింది. సముద్ర మట్టానికి దాదాపు 4,400 మీటర్ల ఎత్తున, హిమాలయ సానువుల అంచుల్లో ఈ పోస్టాఫీస్ ఉంది. ఇక్కడ ఒక్కో పోస్ట్ కార్డును రూ. 70కి అమ్ముతుంటారు. రాష్ట్ర అందాలను చూపిస్తూ ఉన్న చిత్రాలతో ఇవి ముద్రితమవుతాయి.
