jagan: జగన్ గారూ! ఏమిటీ రౌడీరాజ్యం?: నారా లోకేశ్

  • మహిళలకు ఏమిటీ అవమానాలు?
  • వైసీపీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
  • ఎంపీడీవో సరళకు న్యాయం జరుగుతుందా?

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారన్న ఆరోపణలపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. జగన్ గారూ! ఏమిటీ రౌడీ రాజ్యం? మహిళలకు ఏమిటీ అవమానాలు? అని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు.

ఎంపీడీవో పట్ల ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని, న్యాయం చేయలేని పోలీసుల పక్షపాత వైఖరిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్ జగన్ యావత్తు ఏపీకి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని, కేవలం వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎంపీడీవో సరళకు న్యాయం జరుగుతుందా? అని లోకేశ్ ప్రశ్నించారు.

jagan
mpdo
sarala
kotamreddy
Nara Lokesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News