Mahesh Babu: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మహేశ్ సినిమాలో పూజ గెస్ట్ రోల్ 
  • బాలకృష్ణ సినిమా కోసం భారీ సెట్స్
  • బాలీవుడ్ లోకి 'గీత గోవిందం'

*  నేటి బిజీ కథానాయిక పూజా హెగ్డే తాజాగా మహేశ్ బాబు చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడానికి ఓకే చెప్పిందట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో పూజ ప్రత్యేక పాత్రలో కనిపించనుందని అంటున్నారు.
*  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఈ నెల 5 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ ను వేస్తున్నారు.
 *  విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా గత సంవత్సరం వచ్చిన 'గీత గోవిందం' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ ఫిలిం మేకర్ రోహిత్ శెట్టి భారీ రేటుకి కొనుగోలు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News