Cm: సీఎం క్యాంపు కార్యాలయంలో గుర్రం జాషువా పురస్కారాల ప్రదానం

- సీఎం క్యాంపు కార్యాలయంలో జాషువా జయంతి
- జాషువా జీవితం ఆదర్శనీయం
- పురస్కారాలు అందుకున్న కత్తి పద్మారావు, బోయి హైమావతి, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జీవితం నుంచి నేటి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలను అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా పేరిట ఇచ్చిన పురస్కారాలను డాక్టరు కత్తి పద్మారావు, బోయి హైమావతి, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, ఆచార్య చందు సుబ్బారావు అందుకున్నారు.

