Telangana: నేటి నుంచి ఏపీ, తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులు

  • రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేటి నుంచే సెలవులు
  • ఏపీలో వచ్చే నెల 10న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు
  • తెలంగాణలో మాత్రం అక్టోబరు 13 వరకు సెలవులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఆయా ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి వచ్చే నెల 9వ వరకు సెలవులు ప్రకటించగా 10న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ సెలవులు పాఠశాలలకు మాత్రమే. ఇక, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు అక్టోబరు 6 నుంచి 13 వరకు సెలవులు ప్రకటించింది. తెలంగాణలోనూ నేటి నుంచి ప్రారంభం కానున్న సెలవులు వచ్చే నెల 13 వరకు కొనసాగనున్నాయి. 14న తిరిగి పాఠశాలలు తెరుచుకుంటాయి.  

  • Loading...

More Telugu News