Anantapur District: హంద్రీనీవా కాలువలోకి ట్రాక్టర్ బోల్తా.. నలుగురి మృతి

  • అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • సోలార్ ప్లాంట్ పనులకు వెళ్తుండగా కాలువలోకి ట్రాక్టర్ బోల్తా
  • మృతులు మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తింపు

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హంద్రీనీవా కాలువలో ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నంబులపులికుంట మండలంలో జరిగింది. సోలార్ పవర్ ప్లాంట్ పనులకు వీరు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందినవారిని మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో విషాదకర వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News