Prabhas: 'జాన్' స్క్రిప్ట్ పై కసరత్తు అవసరమన్న ప్రభాస్?

  • ప్రభాస్ ను నిరాశ పరిచిన 'సాహో'
  • తదుపరి చిత్రంగా 'జాన్'
  • మార్పులు సూచించిన ప్రభాస్ 

ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'సాహో' ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 'బాహుబలి'తో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ కారణంగా 'సాహో' భారీ వసూళ్లు రాబట్టింది. కానీ నిజానికి ఈ సినిమా ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా కథా కథనాల విషయంలోను .. లుక్ విషయంలోను ప్రభాస్ శ్రద్ధ పెట్టలేదని చాలామంది చెప్పుకున్నారు.

ఈ విషయాన్ని గ్రహించిన ప్రభాస్, తదుపరి ప్రాజెక్టు అయిన 'జాన్' విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ఇంతకుముందే 'జాన్' ఓ 20 రోజుల పాటు షూటింగును జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ పై మరికొంత కసరత్తు జరగాలని దర్శకుడు రాధాకృష్ణతో ప్రభాస్ చెప్పాడట. కథలో కొన్ని మార్పులను సూచించి, ఆ మార్పులు చేసిన తరువాతనే షూటింగ్ మొదలుపెడదామని అన్నాడట. ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణ అదే పనిలో వున్నాడని అంటున్నారు.

  • Loading...

More Telugu News