బోటు ప్రమాద ఘటన.. పోలీసులు తీసిన ఫొటోలు ఎందుకు బయటపెట్టట్లేదు?: మాజీ ఎంపీ హర్షకుమార్
- కేవలం, సమీక్ష నిర్వహించి వెళ్లిపోతే సరిపోతుందా?
- కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని చెబితే చాలా?
- సీఎం జగన్ ని ప్రశ్నించిన హర్షకుమార్
చంద్రబాబు హయాంలో పుష్కరాల ప్రమాద ఘటనపై నాడు వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ఘటనకు సంబంధించి ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని నాడు విమర్శలు చేశారని, మరి, బోటు ప్రమాద ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కేవలం, సమీక్ష నిర్వహించి వెళ్లిపోతే సరిపోతుందా? కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెబితే సరిపోతుందా? అని సీఎం జగన్ ని ప్రశ్నించారు.
‘ఆ బోటులో 93 మంది లేకపోతే, పోలీసులు తీసిన ఫొటోలు ఎందుకు బయటపెట్టట్లేదు?’ అని ప్రశ్నించారు.