ఉండవల్లి శ్రీదేవి కుల దూషణ వ్యవహారం.. ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు!
- ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఘటన
- శ్రీదేవిని దూషించిన నలుగురు టీడీపీ నేతలు
- జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే
అనంతవరంలో వినాయక మండపానికి వెళ్లిన తనపై కొందరు కుల, లింగ వివక్ష వ్యాఖ్యలు చేశారని శ్రీదేవి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు నోటీసులు జారీచేసింది. ఈ విషయమై పూర్తి స్థాయిలో తమకు నివేదికను అందించాలని సవాంగ్ కు జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.