Palnadu: ఊళ్లో ఎలా ఉన్నారు?: ఆత్మకూరు బాధితులతో చంద్రబాబు

  • ఆత్మకూరు బాధితులతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
  • బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న వైనం
  •  చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బాధితులు 

పల్నాడులోని ఆత్మకూరు బాధితులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు ఫోన్ లో మాట్లాడారు. మాజీ సర్పంచ్ ఏసోబు సహా వైసీపీ బాధితులు పలువురికి ఆయన ఫోన్ చేసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ‘ఊళ్లో ఎలా ఉన్నారు? మీ ఇంట్లోనే ఉన్నారా?’ అని ప్రశ్నించారు.

‘ఇళ్లల్లోకి వెళ్లారు. మరి పొలాల్లోకి వెళ్లారా? అని అడిగి తెలుసుకున్నారు. ‘ఇళ్లు బాగు చేసుకుంటున్నాం’ అని చంద్రబాబుకు బాధితులు  బదులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News