Andhra Pradesh: మహిళా ఎస్సై చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను ఆత్మహత్యకు సిద్ధం: నన్నపనేని రాజకుమారి

  • ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు
  • ఆ ఆరోపణలు కరెక్టు కాదు
  • మహిళా కమిషన్ చైర్మన్ పదవికి బలవంతంగా రాజీనామా చేయించారు

‘ఛలో ఆత్మకూరు’ సందర్భంగా టీడీపీ నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి తనను కులం పేరిట దూషించారని ఓ మహిళా ఎస్సై ఆరోపించడం విదితమే. ఈ ఆరోపణలపై నన్నపనేని స్పందించారు.

ఆమెను కించపరిచేలా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆ ఆరోపణలు కరెక్టు కాదని స్పష్టం చేశారు. మహిళా ఎస్సైని అవమానకరంగా మాట్లాడినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకునేందుకు తాను సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు.

వైసీపీ సర్కార్ తనను మానసిక వేధింపులకు గురి చేసి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి బలవంతంగా రాజీనామా చేయించిందని ఆరోపించారు. రాజీనామా చేసినా ప్రభుత్వం తనను వదలడం లేదని విమర్శించారు.

Andhra Pradesh
Telugudesam
Nannapaneni
YSRCP
  • Loading...

More Telugu News