Andhra Pradesh: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తున్నామన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: ఏపీ మంత్రి బొత్స

  • ఎవరినీ తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదు
  • ‘ఇది సీఎం జగన్ చెప్పిన మాట’
  • గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేస్తాం

ఏపీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నియమించిన ఉద్యోగులను తొలగిస్తున్నామన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరినీ తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ‘ఇది సీఎం జగన్ చెప్పిన మాట’ అని పేర్కొన్నారు. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే భారీగా నియామకాలు చేస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News