Srisailam: మూడున్నర లక్షల క్యూసెక్కులు దాటిన శ్రీశైలం వరద... 10 గేట్లు ఎత్తివేత!

  • 3.69 లక్షల క్యూసెక్కులకు పెరిగిన వరద
  • 3.08 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్ కు
  • గేట్ల నిర్వహణపై విమర్శలు

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణమ్మ పోటెత్తింది. నిన్న 1.40 లక్షల క్యూసెక్కులకుపైగా ఉన్న వరద, ఈ ఉదయం 3.69 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. నిన్న సాయంత్రం నాలుగు గేట్లను తెరిచిన అధికారులు, ఈ ఉదయం మరో ఆరు గేట్లను తెరిచి, 3.08 లక్షల క్యూసెక్కులను స్పిల్ వే ద్వారా నాగార్జున సాగర్ డ్యామ్ కు వదులుతున్నారు. మిగతా వరద నీరు వివిధ కాలువల ద్వారా ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చేందుకు పంపుతున్నారు.

కాగా, ఈ ఉదయం డ్యామ్ గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తూ కనిపించడంతో గేట్ల నిర్వహణపై అధికారులు శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు పారుతోంది.

Srisailam
Dam
Gates
Krishna River
Flood
  • Loading...

More Telugu News