Cricket: సంజూ శాంసన్ పెద్ద మనసు.. మ్యాచ్ ఫీజు మొత్తం గ్రౌండ్ సిబ్బందికి ఇచ్చేసిన క్రికెటర్!

  • తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా-ఏతో మ్యాచ్
  • వర్షం పడ్డా మైదానాన్ని మ్యాచ్ కు సిద్ధం చేసిన సిబ్బంది
  • సంజూ విజృంభణతో విజయం సాధించిన భారత్

భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మ్యాచ్ ఫీజుగా తనకు వచ్చిన నగదు మొత్తాన్ని మైదానం సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో రెండ్రోజుల క్రితం వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ముందు వర్షం కురవగా, మైదానం సిబ్బంది తీవ్రంగా శ్రమించి గ్రౌండ్ ను మ్యాచ్ కు సిద్ధం చేశారు.

కేవలం 20 ఓవర్లే జరిగిన ఈ మ్యాచ్ లో సంజూ కేవలం 48 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. దీంతో భారత్-ఏ జట్టు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కేవలం 168 పరుగులకే కుప్పకూలింది. దీంతో మైదానం సిబ్బంది వల్లే ఈ మ్యాచ్ సాధ్యమయిందని అభిప్రాయపడ్డ సంజూ శాంసన్, తనకు మ్యాచ్ ఫీజుగా అందే రూ.1.50 లక్షలను మైదానం సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించేశారు. కాగా, సంజూ నిర్ణయంపై పలువురు క్రికెట్ ప్రేమికులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Cricket
sanju
Match fee
Donated
Ground Staff
Rs.1.50 lakh
  • Loading...

More Telugu News