Andhra Pradesh: ఆర్టీసీని అప్పులఊబిలో దించింది మీ మహామేతే వీసారెడ్డీ!: బుద్ధా వెంకన్న

  • దాన్ని చంద్రబాబు బయటపడేశారు
  • కార్మికులు సంతోషంగా ఉన్నట్లు బిల్డప్పులు వద్దు
  • సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీని, ఏపీ డెయిరీని చంద్రబాబు నిర్వీర్యం చేశారని విజయసాయిరెడ్డి ఈరోజు దుయ్యబట్టారు. తాజాగా ఆయన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీని మహామేతే అప్పుల ఊబిలోకి దించారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

అలాంటి ఆర్టీసీని చంద్రబాబు అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని విలీనం చేయగానే సమస్యలు పరిష్కారం అయిపోయినట్లు, కార్మికులంతా ఆనందంలో ఉన్నట్లు చెత్త  బిల్డప్పులు ఇవ్వవద్దని హితవు పలికారు. ముందుగా కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికైనా ఈ శుక్రవారం మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News