gova: గోవా ముఖ్యమంత్రి పారికర్... మరణించి ఐదున్నర నెలలైనా ఆయన పేరున ప్రభుత్వ ప్రకటన!

  • ఆ రాష్ట్ర సమాచార శాఖ తీరిది
  • ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వాకం
  • నవ్వులపాలు కావడంతో దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం

గోవా ముఖ్యమంత్రిగా ఉండగా మనోహర్‌ పారికర్‌ తీవ్ర అనారోగ్యం బారినపడి మార్చి 17న మృతి చెందిన విషయం తెలిసిందే. కానీ ఆయన పేరున నిన్న ఓ ప్రకటన విడుదల చేసి ఆ రాష్ట్ర సమాచార శాఖ నవ్వులపాలయ్యింది. గురుపూజోత్సవం సందర్భంగా గోవాలోని ఉపాధ్యాయుందరికీ ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అని ఉండడంతో విస్తుపోవడం ఉపాధ్యాయులు, అధికారుల వంతయ్యింది. పారికర్‌ చనిపోయిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమోద్‌సావంత్‌ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఈ విషయం మర్చిపోయిన అధికారులు మనోహర్‌ పేరుతో ప్రకటన విడుదల చేసి అభాసుపాలయ్యారు. ఈ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం బాధ్యులపై దర్యాప్తునకు ఆదేశించింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News