Vishnuvardhan: ఎన్టీఆర్ బయోపిక్ ఖరీదైన గుణపాఠం నేర్పింది: నిర్మాత విష్ణువర్ధన్

  • ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించడం మాకు గర్వకారణం
  • అంచనాలను అందుకోలేకపోవడానికి అదే కారణం 
  • అక్కడే పొరపాటు చేసివుంటామన్న నిర్మాత  

ఎన్టీఆర్ బయోపిక్ గా 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' చిత్రాలను నిర్మించిన నిర్మాత విష్ణువర్ధన్, ఒక వైపున కపిల్ దేవ్ బయోపిక్ పనులతోను .. మరో వైపున జయలలిత బయోపిక్ పనులతోను బిజీగా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ ను గురించి ప్రస్తావించారు.

"ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం మాకు రావడం నిజంగా గర్వకారణమే. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోవడానికి అనేక కారణాలు వున్నాయి. ప్రేక్షకులు ఆశించిన 'కీ' పాయింట్ ఏదో మేము మిస్ అయ్యాము అనిపించింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తీసి వుంటే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేదేమో అనిపించింది. ఈ విషయంలోనే పొరపాటు చేసి ఉంటాము. ఏదేవైనా ఈ సినిమా ఖరీదైన గుణపాఠం నేర్పింది' అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News