Andhra Pradesh: వెరైటీగా వినాయక చవితి.. 2 లక్షల నెమలి పింఛాలతో గణేశుడి విగ్రహం ఏర్పాటు!

  • శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెరైటీ గణేశుడు 
  • దేశంలో ఇలా చేయడం ఇదే తొలిసారి
  • గిన్నిస్ రికార్డులో చేర్చేందుకు ప్రయత్నాలు మొదలు

ప్రస్తుతం వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రూపాల్లో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో పలువురు భక్తులు వినాయకుడి విగ్రహాలకు ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలోని కాపువీధి వాసులు వినూత్న ప్రయత్నం చేశారు.

ఏకంగా 2 లక్షల నెమలి పింఛాలతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా పూర్తిగా నెమలి పింఛాలతో వినాయకుడిని తయారుచేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈ వినాయకుడిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసేందుకు పాలకొండ వాసులు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా వినాయకుడి విగ్రహాన్ని మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేస్తారు.

Andhra Pradesh
Srikakulam District
nemali
peacock
vinayakudu
ganesh statue
Gunnis
  • Loading...

More Telugu News