YSR Kanti Velugu: అక్టోబర్ 10 నుంచి 'వైయస్సార్ కంటివెలుగు'

  • వచ్చే నెల 10 నుంచి వైయస్సార్ కంటివెలుగు
  • అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు
  • అవసరమైనవారికి ఉచితంగా కళ్లజోళ్లు

ఏపీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభిస్తోంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి 'వైయస్సార్ కంటివెలుగు' పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద అందరికీ ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. అవసరమైనవారికి కళ్లజోళ్లను ఉచితంగా అందించనున్నారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.

  • Loading...

More Telugu News