India: కశ్మీరీల కోసం తల్వార్ పడతా.. పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ నోటి దురుసు!

  • ఆర్టికల్ 370 రద్దుపై మియాందాద్ ఆగ్రహం
  • కశ్మీరీలకు తాను అండగా ఉంటానని వ్యాఖ్య
  • సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఇటీవల పార్లమెంటు రద్దుచేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ ల పేరిట రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. దీంతో ఇంతకాలం జమ్మూకశ్మీర్ లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టిన పాకిస్థాన్ అగ్గిమీదగుగ్గిలం అవుతోంది. కశ్మీర్ కోసం తుదకంటూ పోరాడుతామని బీరాలు పలుకుతోంది. తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కూడా చేరిపోయాడు. భారత్ ను రెచ్చగొట్టేలా నోటి దురుసు వ్యాఖ్యలు చేశాడు.

 పాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మియాందాద్ మాట్లాడుతూ.. ‘కశ్మీరీ సోదరులారా.. భయపడకండి. నేను మీకు అండగా ఉంటాను. బ్యాట్ పట్టి సిక్స్ కొట్టినవాడిని. తల్వార్ తో మనిషిని చంపలేనా?’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నట్లు మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం కుమార్తెను ఈ జావెద్ మియాందాద్ కుమారుడికి 2006లో ఇచ్చి పెళ్లి చేశారు.

  • Loading...

More Telugu News