Andhra Pradesh: ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టి.. ప్రతి జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

  • సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తూ.గో. జిల్లా నుంచి పర్యటన  
  • ప్రతి వారంలో రెండ్రోజులు పర్యటన
  • జిల్లా కేంద్రంలోనే రెండ్రోజులు మకాం వేయనున్న బాబు

ఏపీలో టీడీపీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రతి వారంలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా నుంచి సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఈ పర్యటన ప్రారంభిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోనే రెండ్రోజులు చంద్రబాబు మకాం వేస్తారని, టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News