UAE: 130 కోట్ల భారతీయులకు ఇది అంకితం చేస్తున్నా: మోదీ

  • మోదీని అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించిన యూఏఈ
  • భారత ప్రధానికి ఆర్డర్ ఆఫ్ జాయేద్ ప్రదానం
  • భారత సాంస్కృతిక వైభవానికి దక్కిన గుర్తింపుగా భావిస్తానని ట్వీట్

భారత ప్రధాని నరేంద్ర మోదీని యూఏఈ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయేద్ తో గౌరవించిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ, 130 కోట్ల మంది భారతీయులకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నానంటూ ట్వీట్ చేశారు. వ్యక్తిగా కంటే దేశ సాంస్కృతిక వైభవానికి దక్కిన గుర్తింపుగా ఈ పురస్కారాన్ని భావిస్తానని తెలిపారు. ఆర్డర్ ఆఫ్ జాయేద్ పురస్కారం లభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ గౌరవాన్ని తనకు అందించినందుకు యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ప్రధాని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News