Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను శాడిస్టు బాస్ తో పోల్చిన టీడీపీ నేత లోకేశ్!

  • యానిమేటర్ల జీతాలు రూ.10 వేలు చేశామన్నారు
  • అంతలోనే గ్రామవాలంటీర్లను తీసుకొచ్చారు
  • ఓ ఉద్యోగం ఇచ్చి 10 ఉద్యోగాలు తీసేస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శాడిస్టు బాస్ లా మారారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. యానిమేటర్ల జీతాలను నెలకు రూ.10 వేలు చేశామన్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు గ్రామ వాలంటీర్లను తెచ్చి వాళ్లను వెళ్లిపొమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అనగనగా ఒక శాడిస్టు బాస్, ఉద్యోగిని పిలిచి 'నీకు జీతం రెట్టింపు చేశా' అన్నాడట. అతను సంతోషిస్తూ కృతజ్ఞతలు చెబుతుంటే, 'నీకింకో విషయం చెప్పాలి, నిన్ను ఉద్యోగం నుంచి తీసేశా' అన్నాడట.

'అలాంటప్పుడు నాకు జీతం ఎందుకు పెంచారు?' అని అడిగితే ‘ఉద్యోగం పోయిన బాధ నీకు రెట్టింపు చేయడానికి’’ అని అన్నాడట. సీఎం జగన్ గారు అదే చేస్తున్నారు’’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి 10 ఉద్యోగాలను తీసేశారని లోకేశ్ మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయమని ఏపీ ముఖ్యమంత్రిని నిలదీశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News