Tamilnadu: 40 సంవత్సరాలు సేదదీరేందుకు అనంత పుష్కరిణిలోకి వెళ్లిపోయిన అత్తి వరదరాజ స్వామి!

  • 48 రోజుల పాటు పూజలందుకున్న స్వామి
  • తిరిగి జలావాసంలోకి అత్తి వరదరాజస్వామి
  • తిరిగి బయటకు వచ్చేది 2059లోనే

తమిళనాడులోని కాంచీపురంలో, గత 48 రోజులుగా భక్తులకు దర్శనమిచ్చిన అత్తి వరదరాజ స్వామి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. నిన్న రాత్రి స్వామివారు 40 ఏళ్లు సేదదీరేందుకు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న అనంత పుష్కరిణిలోకి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. భారీ బందోబస్తు మధ్య, పుష్కరిణి చుట్టూ వేలాది మంది ప్రజలు చూస్తుండగా, స్వామివారి నిలువెత్తు ప్రతిమను కోనేటి మధ్యలో ఉన్న మండపం కిందకు చేర్చారు.అంతకుముందే స్వామివారికి చివరి హారతిని ఇచ్చిన అర్చకులు, ఆలయ తలుపులను మూసివేశారు. ఆపై కొన్ని సంప్రదాయ క్రతువుల తరువాత, చుట్టూ పరదాలు కట్టి, స్వామిని జలప్రవేశం చేయించారు. విష్ణుమూర్తి అవతారమైన అత్తివరదరాజస్వామి 1979లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆపై ఈ సంవత్సరం జూలై 1 నుంచి భక్తుల కోరికలు తీర్చేందుకు జలావాసం వీడి బయటకు వచ్చారు. 31 రోజుల పాటు శయన అవతారంలో, ఆపై 17 రోజుల పాటు నిలబడిన అవతారంలో కనిపించిన స్వామి, తిరిగి బయటకు వచ్చేది 2059లోనే.

Tamilnadu
Kanchi
Atti Varadarajar
  • Loading...

More Telugu News