Vijay: 'బిగిల్' యూనిట్ కి బంగారు ఉంగరాలు పంచిన విజయ్

  • అట్లీ కుమార్ దర్శకత్వంలో 'బిగిల్'
  • విజయ్ సరసన నయనతార 
  • దీపావళికి భారీస్థాయి విడుదల  

హీరో విజయ్ కి తమిళనాట గల క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. సెట్లోకి అడుగుపెట్టగానే తన స్టార్ డమ్ ను పక్కన పెట్టేసి, ఆ యూనిట్ సభ్యులందరితోను ఆయన ఆత్మీయంగా మసలుకుంటాడు. వాళ్ల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అందువలన ఆయన సినిమాకి ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేస్తారు.

అందువల్లనే సినిమా పూర్తయిన ప్రతిసారి ఆ సినిమా కోసం కష్టపడిన వాళ్లందరికి ఆయన కానుకలు అందజేస్తుంటాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందుతోన్న 'బిగిల్' చిత్రం రీసెంట్ గా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, యూనిట్ సభ్యులందరికీ సినిమా టైటిల్ రాయబడిన బంగారు ఉంగరాలను విజయ్ అందజేశాడు. దాంతో యూనిట్ సభ్యులంతా ఆనందంతో పొంగిపోతున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను 'దీపావళి'కి విడుదల చేయనున్నారు. 

  • Loading...

More Telugu News