రేపు విజయవాడలో నిర్వహించేది పెట్టుబడుల సదస్సు కాదు: పరిశ్రమల శాఖ కార్యదర్శి
- ఇది విదేశీ రాయబారులతో పరస్పర అవగాహన సదస్సు
- 35 దేశాల నుంచి 40 మంది రాయబారులు, కాన్సుల్ జనరల్స్ హాజరుకానున్నారు
- సీఎంతో 13 మంది రాయబారులు ముఖాముఖీ మాట్లాడనున్నారు
ఈ సదస్సు ద్వారా ఏపీలో వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం, మంత్రులు వివరిస్తారని అన్నారు. నవరత్నాల పథకాల్లోని వివిధ అంశాలపై పెట్టుబడులకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాలు తమ ఆసక్తిని కనబరిచాయని తెలిపారు. ఈ సదస్సులో సీఎంతో పదమూడు మంది రాయబారులు ముఖాముఖీ మాట్లాడనున్నారని అన్నారు.