Rohit Sharma: రోహిత్ ఫిఫ్టీ... టీమిండియా 20 ఓవర్లలో 167/5

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • రోహిత్ దూకుడు
  • చివర్లో కృనాల్ పాండ్య మెరుపులు

ఓపెనర్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ వెస్టిండీస్ పై ఫిఫ్టీ సాధించగా, టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. విండీస్ తో రెండో టి20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా రోహిత్ శర్మ 51 బంతుల్లో 67 పరుగులతో అదరగొట్టాడు. ఈ డాషింగ్ ఓపెనర్ 6 ఫోర్లు, 3 సిక్స్ లు బాది ప్రేక్షకులను అలరించాడు. మరో ఓపెనర్ ధావన్ 23, కెప్టెన్ విరాట్ కోహ్లీ 28 పరుగులు చేశారు. పంత్ మరోసారి నిరాశపరుస్తూ 4 పరుగులకే వెనుదిరిగాడు. చివర్లో కృనాల్ పాండ్య 13 బంతుల్లో 2 సిక్స్ లతో 20 పరుగులు సాధించాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఒషేన్ థామస్, షెల్డన్ కాట్రెల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కీమో పాల్ కు ఓ వికెట్ దక్కింది.

  • Loading...

More Telugu News