Chandrababu: అది దురదృష్టకరమైన రోజు.. చంద్రబాబు అందుకే ఓడారు: బీజేపీ నేత సుజనా చౌదరి

  • 8 మార్చి 2018 ఏపీ చరిత్రలో దురదృష్టకరమైన రోజు
  • చంద్రబాబు తప్పిదాల వల్లే జగన్ అధికారంలోకి వచ్చారు
  • నాలుగేళ్లపాటు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది

తెలుగుదేశం పార్టీని వీడిన నెల రోజుల తర్వాత, ఆ పార్టీకి తానెందుకు గుడ్‌బై చెప్పిందీ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో టీడీపీ ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించారు. బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకోవడం వల్లే టీడీపీ ఓడిందన్నారు. బీజేపీతో కలిసి ఉంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేవారని పేర్కొన్నారు. బాబు చేసిన ఆ ఒక్క తప్పిదం వల్లే జగన్ అధికారంలోకి రాగలిగారని సుజానా చౌదరి అన్నారు. బీజేపీకి చంద్రబాబు కటీఫ్ చెప్పిన 8 మార్చి 2018ని ఏపీ చరిత్రలోనే దురదృష్టకరమైన రోజుగా తాను భావిస్తానని పేర్కొన్నారు.

బీజేపీ విషయంలో చంద్రబాబు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్ల నాలుగేళ్లపాటు అభివృద్ధి కోసం టీడీపీ-బీజేపీ కలిసి చేసిన కృషి ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు కూడా వైదొలిగాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు  ఎవరూ ముందుకు రావడం లేదని సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News