KCR: ముచ్చింతల్ ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

  • కేసీఆర్ కు ఆశ్రమ వర్గాల సాదర స్వాగతం
  • చినజీయర్ ఆశీస్సులు అందుకున్న తెలంగాణ సీఎం
  • కేసీఆర్ వెంట 'మైహోం' రామేశ్వరరావు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆధ్యాత్మిక భావాలు మెండు. హోమాలు తరచుగా నిర్వహిస్తుంటారు. తాజాగా, రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో త్రిదండి చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ముచ్చింతల్ లో ఉన్న ఆశ్రమానికి చినజీయర్ స్వామి వచ్చారని తెలియడంతో 'మైహోం' రామేశ్వరావు, ఎంపీ సంతోష్ కుమార్ లతో కలిసి కేసీఆర్ ఆశ్రమానికి విచ్చేశారు. సీఎం కేసీఆర్ కు ఆశ్రమ వర్గాలు సాదరంగా స్వాగతం పలికాయి. అనంతరం కేసీఆర్, చినజీయర్ స్వామితో కాసేపు చర్చలు జరిపారు.

  • Loading...

More Telugu News