14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై వేటు... యడియూరప్ప విశ్వాస పరీక్షకు గంటల ముందు కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం!
- 11 మంది కాంగ్రెస్ ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలపై వేటు
- మీడియాకు వెల్లడించిన రమేశ్ కుమార్
- రాజీనామాలు ఆమోదించకుండా వేటు ఏంటంటున్న బీజేపీ
ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ ను స్వయంగా మీడియా ముందు ప్రకటించిన రమేశ్ కుమార్, స్పీకర్ గా తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. కాగా, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధుల రాజీనామాలను ఆమోదించకుండా, వారు తప్పు చేసినట్టు డిస్ క్వాలిఫై చేయడం ఏంటని పలువురు బీజేపీ నేతలు తప్పుబడుతుతున్నారు. కాగా, డిస్ క్వాలిఫై అయిన వారిలో కాంగ్రెస్ నుంచి బస్వరాజు, మునిరత్నం, సోమశేఖర్, సుధాకర్, శివరాం హెబ్బర్, శ్రీమంత పాటిల్, జేడీఎస్ నుంచి గోపాలయ్య, నారాయణ గౌడ, విశ్వనాథ్ తదితరులున్నారు.