Andhra Pradesh: పీపీఏలపై పున:సమీక్షించే జీవో నెం.63ను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు

  • జీవోను సవాల్ చేసిన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు
  • వచ్చే నెల 22కు విచారణ వాయిదా
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

ఏపీలో గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పున:సమీక్షించాలని ఆదేశిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల జీవో నెం.63 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నలభై విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఈ జీవోను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ (సస్పెండ్ చేస్తూ) ఆదేశాలు జారీ చేసింది. ఈ జీవోతో పాటు ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖనూ నిలిపివేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ పిటిషన్ పై విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.  

  • Loading...

More Telugu News