భారత మార్కెట్ పై కన్నేసిన ‘నెట్ ఫ్లిక్స్’.. 199కే కొత్త ప్లాన్ ప్రకటన!
- ఇప్పటివరకూ కనీస ప్లాన్ గా రూ.500 వసూలు
- భారత మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు
- అమెజాన్ ప్రైమ్ ను వెనక్కు నెట్టాలని వ్యూహం
ఈ ప్లాన్ లో ఎలాంటి యాడ్లు లేకుండా స్టాండర్డ్ డెఫినేషన్ వీడియోలను ప్రేక్షకులు వీక్షించవచ్చని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. అయితే ఈ సౌకర్యం కేవలం భారత్ లోని స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల యూజర్లకు మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం తమకు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో 14.8 కోట్ల మంది చందాదారులు ఉన్నట్లు పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ నెలకు రూ.129లతో ప్రస్తుతం సేవలు అందిస్తోంది.