బీజేపీ ఎంపీ సాధ్వి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్
- దుమారాన్ని రేపుతున్న సాధ్వి వ్యాఖ్యలు
- సాధ్విని వివరణ కోరిన బీఎల్ సంతోష్
- సాధ్విని మందలించిన జేపీ నడ్డా
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆమెను మందలించినట్టు తెలుస్తోంది. బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ సాధ్విని వివరణ కోరినట్టు సమాచారం. గతంలో కూడా సాధ్వి మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి ఒకసారి, తన శాపం వల్లే ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ముంబై ఉగ్రదాడిలో మరణించారని వ్యాఖ్యానించి వివాదాస్పదమయ్యారు. అప్పుడు కూడా ఆమెపై అధిష్ఠానం కన్నెర్ర జేయడంతో ఆమె క్షమాపణ చెప్పారు.