Andhra Pradesh: జగనన్న వచ్చారు, వరల్డ్ బ్యాంక్ పోయింది: నారా లోకేశ్

  • వైఎస్ జగన్ గారి కల నెరవేరింది
  • మొత్తానికి అమరావతిని పడగొట్టేశారు
  • జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ‘ఇక సెలవు’ అంది

ఏపీకి నిధులు ఇవ్వమని వరల్డ్ బ్యాంకు చెప్పడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ పై మండిపడుతున్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ, చంద్రబాబు హయాంలో కళకళలాడిన అమరావతి, జగన్ అధికారంలోకి వచ్చాక కళ తప్పిందని, ఆయన తుగ్లక్ చర్యలతో రాజధాని ఖాళీ అవుతోందని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘జగనన్న వచ్చారు, వరల్డ్ బ్యాంక్ పోయింది. వైఎస్ జగన్ గారి కల నెరవేరింది. మొత్తానికి అమరావతిని పడగొట్టేశారు. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది. బాబు గారి హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయింది’ అని ఓ ట్వీట్ లో విమర్శించారు.

‘అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే  కార్యాచరణలో జగన్ గారు మొదటి అడుగు విజయవంతంగా వేశారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో !’ అని మరో ట్వీట్ లో అనుమానం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News