Andhra Pradesh: కాపులకు సరే.. బ్రాహ్మణులకు కూడా కేటాయిస్తే బాగుంటుంది!: ఐవైఆర్ కృష్ణారావు

  • కాపులకు బడ్జెట్ లో రూ.2,000 కోట్లు
  • రాబోయే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామన్న సీఎం జగన్
  • బ్రాహ్మణులకు కూడా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలన్న ఐవైఆర్

ఎన్నికల హామీలకు తగ్గట్టుగానే వైసీపీ ప్రభుత్వం కాపు సామాజికవర్గానికి 2019-20 బడ్జెట్ లో రూ.2,000 కోట్లు కేటాయించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో కాపు కార్పొరేషన్ కు రూ.10,000 కోట్లు కేటాయిస్తామని కూడా చెప్పారు. దీనిపై బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఐవైఆర్ తెలిపారు. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా రాబోయే ఐదేళ్లకు రూ.1000 కోట్లు కేటాయించాలని కోరారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐవైఆర్ ట్విట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Chief Minister
Jagan
BJP
IYR krishnarao
kapu corporation
brahmin corporation
  • Error fetching data: Network response was not ok

More Telugu News