Social Media: ఉచితంగా స్కూటీ ఇస్తున్నారంటూ ప్రచారం... తెలంగాణలో మీ-సేవ కేంద్రాలకు లక్షలాది మంది పరుగులు!

  • సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్
  • నమ్మి మీ-సేవా కేంద్రాల వద్దకు మహిళలు
  • అటువంటి పథకం లేదన్న మహిళా శిశు సంక్షేమ శాఖ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించారని, మహిళలకు ఉచితంగా స్కూటీలను ఇస్తున్నారని, వెంటనే మీ-సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్న ప్రచారం జరగడంతో లక్షలాది మంది అప్లికేషన్ పెట్టుకునేందుకు క్యూ కట్టారు. పదో తరగతి పాసై, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులంటూ, ఆ ప్రకటన వైరల్‌ కావడంతో, మీ-సేవ కేంద్రాలకు తాకిడి పెరిగింది.

  అయితే, అటువంటి పథకమేమీ కేంద్రం ప్రకటించలేదని, ఈ వార్తలు అవాస్తవమని, ఎవరూ స్కూటీల కోసం మీ-సేవకు వెళ్లవద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను గుర్తించే సంస్థ 'ఫ్యాక్ట్‌ లీ' సైతం ఇదే విషయాన్ని ప్రకటించింది. కొందరు ఆకతాయిలు సృష్టించిన ప్రచారమే ఇదని తెలిపింది.

Social Media
Scooty
Free
Mee-seva
  • Loading...

More Telugu News