Madhurai: మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో బయటపడ్డ రహస్య సొరంగం... భారీ నిధి నిక్షేపాలు ఉన్నాయంటున్న స్థానికులు!

- పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు
- బయటపడిన మండపం
- దాన్ని ఆనుకుని ఓ రహస్య సొరంగం
- పనులు నిలిపివేసిన అధికారులు
తమిళనాడులోని ప్రఖ్యాత మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఓ రహస్య సొరంగం బయటపడింది. ఆలయం ప్రాంగణంలో మరమ్మతు పనులు జరుపుతుండగా, ఈ సొరంగాన్ని అధికారులు గుర్తించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని అనుకుని పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతూ ఉండగా, పురాతన స్తూపం, 10 అడుగుల ఎత్తు ఉన్న ఓ మండపం, దాని కింద నుంచి సొరంగ మార్గం వెలుగులోకి వచ్చాయి.
ఈ మార్గం ఆలయం లోపలి నుంచి ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఎంతవరకూ వెళ్లిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.
