World cup: ఈ విషయాన్ని కేన్ విలియమ్ సన్ కు గుర్తుచేస్తా: విరాట్ కోహ్లీ

  • 2008 అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ను ప్రస్తావించిన కోహ్లీ
  • అప్పుడు, విలియమన్ సన్, నేను కెప్టెన్ లుగా ఉన్నాం
  • ఇప్పుడూ కెప్టెన్లగానే రేపటి మ్యాచ్ లో తలపడనున్నాం

ప్రపంచకప్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య రేపు సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని కోహ్లీ ప్రస్తావించాడు. ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ, 2008 అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయని, అప్పుడు, కివీస్ జట్టుకు కేన్ విలియమ్ సన్, టీమిండియాకు తాను కెప్టెన్ లు గా వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. మళ్లీ, రేపటి మ్యాచ్ లో తాము పోటీపడుతున్నామని చెప్పిన కోహ్లీ, ఈ విషయాన్ని విలియన్ సన్ కు గుర్తుచేస్తానని అన్నాడు. పదకొండేళ్ల తర్వాత సీనియర్ వరల్డ్ కప్ లో తామిద్దరం నాయకత్వం వహిస్తుండటం సంతోషంగా ఉందని అన్నాడు.

  • Loading...

More Telugu News