బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడానికి కారణం ఇదేనట!
- విదేశీ కరెన్సీని ఖర్చు చేసుకోవడం మంచిది కాదు
- టన్నుల కొద్దీ అవసరం లేదు
- కొద్ది మొత్తంలో దిగుమతి చేసుకుంటే చాలు
కేంద్ర ప్రభుత్వం అత్యవసరం కాని వస్తువుల దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచిందని అజయ్ తెలిపారు. అవసరం లేని వస్తువుల దిగుమతి కోసం మన విదేశీ కరెన్సీని ఖర్చు చేసుకోవడం మంచిది కాదని, వీటిలో బంగారం ఒకటని అన్నారు. బంగారాన్ని టన్నుల కొద్దీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని, కొద్ది మొత్తంలో చేసుకుంటే చాలని అన్నారు.