Visakhapatnam District: విశాఖ, గుంటూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ!

  • పొన్నూరు మండలంలో ఇరుపార్టీల కార్యకర్తల ఘర్షణ
  • ఈ ఘటనలో నలుగురికి గాయాలు
  • విశాఖలో మరో ఘటన..ఇద్దరికి గాయాలు

ఏపీలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా, పొన్నూరు మండలంలోని కొండమూదిలో ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు పాల్పడ్డారు. రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరోపక్క, విశాఖపట్టణం జిల్లా, సబ్బవరం మండలంలోని గుల్లేపల్లి వద్ద టీడీపీ వర్గీయులపై దాడి జరిగింది. ఈ ఘటనలో చింతగట్ల పంచాయతీ ఇప్పిలివానిపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఇద్దరికి గాయాలు అయ్యాయి. తమపై దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలేనని బాధితులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News