Congress: మా ఎమ్మెల్యేలంతా తిరిగొస్తారు: కర్ణాటక కాంగ్రెస్ నేత హెచ్ కే పాటిల్

  • అసంతృప్త ఎమ్మెల్యేలతో హైకమాండ్ చర్చలు జరుపుతోంది
  • కాంగ్రెస్ ప్రభుత్వం సురక్షితంగా, సుస్థిరంగా ఉంటుంది
  • కాంగ్రెస్ లో కల్లోలానికి కారణం బీజేపీనే

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం సమసిపోతుందని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేలంతా తిరిగి కాంగ్రెస్ లోకే వస్తారని కర్ణాటక కాంగ్రెస్ నేత హెచ్ కే పాటిల్ నమ్మకం వ్యక్తం చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో పార్టీ హైకమాండ్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సురక్షితంగా, సుస్థిరంగా ఉంటుందని అన్నారు. కర్ణాటకలో రాజకీయ కల్లోలానికి కారణం బీజేపీయేనని, బీజేపీ అధినాయకత్వమే కాంగ్రెస్ లో సమస్యలు సృష్టిస్తోందని పాటిల్ ఆరోపించారు. కాగా, ప్రస్తుత సంక్షోభంపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ నెల 9న కర్ణాటక విధానసభలో సమావేశం కానుంది. అటు, రాజీనామా చేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబయిలో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News