Andhra Pradesh: వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రమాదంలో మరణించిన సుబ్రహ్మణ్యం కుమార్తెకు ఉద్యోగం

  • గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సింధు సుబ్రహ్మణ్యం
  • గ్రూప్-1 ర్యాంక్ తో డిప్యూటీ కలెక్టర్ గా నియామకం  
  • ఉత్తర్వులు జారీచేసిన ఏపీ సర్కారు

పదేళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆనాడు వైఎస్సార్ తో పాటు ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కూడా ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సుబ్రహ్మణ్యం సీఎంకు కార్యదర్శిగా వ్యవహరించారు. ఇప్పుడాయన కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు ఏపీ సర్కారు ఉద్యోగం కల్పించింది. ఆమెను రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 సర్వీసు కింద డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. సింధు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆమెను ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తున్నట్టు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఆదేశాలు జారీచేశారు.

  • Loading...

More Telugu News