దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి పనికిరాని భూములు అంటగట్టారు: కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్
- దళితుడ్ని సీఎం చేస్తామన్నారు
- కేసీఆర్ మోసం చేశారు
- అంబేద్కర్ విగ్రహ నిర్మాణం శంకుస్థాపనతోనే సరిపెట్టారు
హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో లక్ష్మణ్ ప్రసంగించారు. అంబేద్కర్ భవనాన్ని కళ్లుచెదిరే రీతిలో నిర్మిస్తామని, దేశంలో మరెక్కడా లేని రీతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు, ఇప్పటికీ ఆ పనిచేయలేదని విమర్శించారు. విగ్రహ నిర్మాణం కేవలం శంకుస్థాపనతోనే సరిపెట్టారని ఆరోపించారు.